విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో మచిలీపట్నం-నర్సాపూర్ మధ్య రైల్వే లైన్ నిర్మాణం కోసం ఫైనల్ లొకేషన్ సర్వేకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఎ.పాటిల్ తెలిపారు.
విజయవాడ:...
more... విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో మచిలీపట్నం-నర్సాపూర్ మధ్య రైల్వే లైన్ నిర్మాణం కోసం ఫైనల్ లొకేషన్ సర్వేకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఎ.పాటిల్ తెలిపారు. 2024-25 రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి రూ.9,151 కోట్లు కేటాయించిందని, ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. రైల్వే బడ్జెట్పై ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపీ మీదుగా తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాలను కలుపుతూ సుమారు రూ.74వేల కోట్ల రైల్వే ప్రాజెక్టు పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయన్నారు.
‘‘కోనసీమ వాసుల కలగా ఉన్న కోటిపల్లి-నర్సాపూర్ మధ్య రూ.2,120 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కొత్త రైల్వే లైన్ కోసం ఈ ఏడాది రూ.300 కోట్లు కేటాయించారు. విజయవాడ-గూడురు మూడో లైన్ ప్రాజెక్టు కోసం రూ.500 కోట్లు, కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైన్ కోసం రూ.310కోట్లు ఇచ్చారు. విజయవాడ డివిజన్లో నిడదవోలు, దువ్వాడ మధ్య మూడు, నాలుగు లైన్ల నిర్మాణానికి ఆమోదం లభించింది. దీంతో పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. విజయవాడ-దువ్వాడ మధ్య ఆటోమెటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ నెలకొల్పుతున్నాం. గూడురు-విజయవాడలో ఆటోమెటిక్ సిగ్నలింగ్తోపాటు ట్రాక్ నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం.
అమరావతి రాజధాని ప్రాంతానికి అనుసంధానంగా కొత్త రైల్వే లైను కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికకు రైల్వే బోర్డు, నీతిఆయోగ్ నుంచి ఆమోదం లభించింది. ఈ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. అమరావతిలో కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం కానుంది. ఏరుపాలెం నుంచి నంబూరు వరకు మొత్తం రూ.2,047 కోట్ల వ్యయంతో 56 కి.మీ రైల్వే లైన్ ఏర్పాటు చేయనున్నాం. రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా తీర్చిదిద్దుతున్నారు.. అందులో విజయవాడ డివిజన్ పరిధిలో 23 స్టేషన్లు ఉన్నాయి. వీటి కోసం రూ.600 కోట్ల వరకు నిధులు మంజూరు కానున్నాయి. విజయవాడ రైల్వే స్టేషన్ సమగ్రాభివృద్ధి కోసం రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ(ఆర్ఎల్డీఏ) సుమారు రూ. 820 కోట్ల అంచనాతో ప్రతిపాదనలను రైల్వే బోర్డుకు పంపింది.
విజయవాడ డివిజన్ పరిధిలో రద్దు చేసిన రైళ్లలో ఇంటర్సిటీ వంటివి ఆగస్టు 10 నుంచి పునరుద్ధరిస్తాం. రద్దీ ఎక్కువగా ఉంటూ వెయింటింగ్ లిస్టు అధికంగా ఉండే ‘ట్రెయిన్ ఆన్ డిమాండ్’ను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చేలా తగిన నిర్ణయాలు తీసుకోవాలని రైల్వేశాఖ ఆదేశించింది’’అని డీఆర్ఎం నరేంద్ర వివరించారు.
#SCOR #APRAILWAYINFRA #BZA #GNT #GTL #VSKP#RAILWAYZONE #APNRL #apNewRailwayLine
please wait...Translate to EnglishVijayawada railway division has confirmed the final location survey for the construction of a new rail line between Machilipatnam-Narasapur. They have allocated a whopping amount of Rs. 9,151 crores in the 2024-25 railway budget. The focus is on essential infrastructure projects. New rail projects worth approximately Rs. 74 crores are underway in Andhra Pradesh, Telangana, Odisha, and other states. Improvements in railway signaling systems are also being implemented quickly in various sections. New railway stations are also planned to be constructed in Amaravati. Overall, there are exciting developments happening in the railway sector in Vijayawada and neighboring regions.