గుడివాడ మీదుగా వచ్చి వెళ్లే పలు రైళ్ల సమయాలు ఈ నెల 10వ తేదీ నుంచి మారినట్లు గుడివాడ రైల్వే స్టేషన్ మేనేజర్ పొట్లూరి మోహన్ గాంధీ తెలిపారు. స్థానిక రైల్వేస్టేషన్లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ట్రైన్ నెంబర్ 17644 కాకినాడ నుంచి చెంగళ్ పట్టు వెళ్లే సర్కార్ ఎక్స్ప్రెస్ రోజూ సాయంత్రం గుడివాడకు 7.23 వచ్చి 7.25కు వెళ్తుండగా అది 6.55కు వచ్చి 7.00 గంటలకు వెళ్తుందన్నారు. ట్రైన్ నెంబర్ 57230 విశాఖపట్నం నుంచి మచిలీపట్నం వెళ్లే ప్యాసింజర్ రైలు రోజూ తెల్లవారుజామున 4.20కు వచ్చి 4.35కు వెళ్తుండగా అది 3.50కు వచ్చి 4.15కు వెళ్తుందన్నారు. ట్రైన్ నెంబర్ 77232 నర్సాపూర్ నుంచి మచిలీపట్నం ప్యాసింజర్ రైలు ఉదయం 8.10కు వచ్చి 9.00గంటలకు వెళ్తుండగా అది ఉదయం 8 గంటలకు వచ్చి 8.30 గంటలకు వెళ్తుందన్నారు.
ట్రైన్ నెంబర్ 77234 మచిలీపట్నం నుంచి గుడివాడ వచ్చే ప్యాసింజర్ రైలు ఉదయం 11.35కు వచ్చి వెళ్లాల్సి ఉండగా ఉదయం 10.55కే వస్తుందన్నారు. ట్రైన్ నెంబర్ 77235 గుడివాడ నుంచి మచిలీపట్నం ప్యాసింజర్ రైలు మధ్యాహ్నం 3.10కు వచ్చి వెళ్ళాల్సి ఉండగా...
more... 3.25కు వచ్చి వెళ్తుందన్నారు. ట్రైన్ నెంబర్ 77218 మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్లే ప్యాసింజర్ రైలు సాయంత్రం 5.40కు వచ్చి 5.45కు వెళ్లాల్సి ఉండగా 6.10కు వచ్చి 6.15కు వెళ్తుందన్నారు. ట్రైన్ నెంబర్ 77206 నర్సాపూర్ నుంచి విజయవాడ వెళ్లే ప్యాసింజర్ రైలు రాత్రి 9.35కు వచ్చి 9.40కు వెళ్లాల్సి ఉండగా రాత్రి 10.25కు వచ్చి 10.30కు వెళ్తుందని ప్రయాణికులు గుర్తించి సురక్షిత ప్రయాణం చేయాలని కోరారు